భారతీయ వైజ్ఞానిక చరిత్రలో ఈరోజుకి ఒక విశిష్ట స్థానం ఉంది. ప్రముఖ వైజ్ఞానిక శాస్త్రవేత్త సీవీ రామన్ 1928 ఫిబ్రవరి 28న ఒక అద్భుత ఆవిష్కరణ చేశారు. ఏదేని ఒక వస్తువు మీద కాంతి కిరణం పడినప్పుడు, అది పరావర్తనం చెందుతుందని.. దానివలననే అది తన గమనాన్ని మార్చుకుంటుందని ససాక్ష్యంగా వెల్లడించారు. దీనినే శాస్త్ర పరిభాషలో రామన్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. శతాబ్దం క్రితమే రామన్ చేసిన గొప్ప ఆవిష్కరణలు ప్రపంచ శాస్త్ర పరిశోధనల్లో ఎంతో ప్రాముఖ్యతను పొందాయి. ఆయన గౌరవార్ధం నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (NCSTC) అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డే (NSD)గా జరుపుకోవడం ప్రారంభించింది.
సీవీ రామన్ ధ్వని మరియు ఆప్టిక్స్కు కొన్ని విశేషమైన కృషి చేసాడు. 1917లో రాజాబజార్ సైన్స్ కాలేజీలో పాలిట్ ఫిజిక్స్ ప్రొఫెసర్గా నియమితులైన మొదటి వ్యక్తి రామన్. 1921లో తన యూరప్ పర్యటనలో భాగంగా.. రామన్ మధ్యధరా సముద్రం యొక్క నీలి రంగును చూసి ఆసక్తి పెంచుకున్నాడు. అనంతరం ఇది పారదర్శక ఉపరితలాలు, మంచు బ్లాక్లు మరియు కాంతితో వివిధ ప్రయోగాలు చేయడానికి దారితీసింది. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెంది నీరు నీలిరంగులో కనిపిస్తుందని ప్రపంచానికి తెలియజేశాడు. అలాగే, మంచు ఘనాల గుండా కాంతి ప్రసరించిన తర్వాత తరంగదైర్ఘ్యంలో వచ్చే మార్పును గురించి తెలియజేశాడు.
తమిళనాడులో 1888 నవంబర్ 7న జన్మించిన సీవీ రామన్ 1970లో తన 82వ యేట కన్నుమూశారు. కానీ, ఆయన జీవితంలో సగం కాలం శాస్త్ర పరిశోధనలలోనే గడపటం విశేషం. రామన్ కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్కు 1930లో ఆయనకు నోబెల్ బహుమతి వరించింది. 1928లో రామన్కు ‘సర్’ పురస్కారం లభించింది. 1947లో ప్రతిష్ఠాత్మక ‘ఫ్రాంక్లిన్ మెడల్’ లభించింది. ఆయనలోని ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 1954లో ‘భారతరత్న’తో సత్కరించింది. 1957లో సోవియట్ యూనియన్ ‘లెనిన్ అవార్డు’ని ప్రదానం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ‘నేషనల్ సైన్స్ డే’ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ