ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కరోనా వైరస్ వణికిస్తుంది. కొన్ని దేశాల్లో కరోనా వైరస్ రెండో వేవ్ కూడా ప్రారంభమవుతుంది. ఇక యూరోప్ దేశాల్లో కొత్తగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడి, మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అన్ని దేశాలను హెచ్చరించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు 10 లక్షలకు చేరుకోగా, ఈ సమయంలో ప్రపంచ దేశాలతో పాటుగా పౌరులంతా కలిసికట్టుగా ఈ కరోనా మహమ్మారిపై పోరాటం కొనసాగించక పోతే మరణాల సంఖ్య 20 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్వో ఎమర్జెన్సీస్ డైరక్టర్ మైఖేల్ ర్యాన్ పేర్కొన్నారు.
కరోనా మరణాల సంఖ్యను నివారించడానికి ఏమి చేయాలో అన్ని దేశాలు సమిష్టిగా సిద్ధంగా ఉన్నాయా? కలిసి చర్యలు తీసుకోకపోతే 20 లక్షల సంఖ్యను చూస్తామని మైఖేల్ ర్యాన్ వ్యాఖ్యానించారు. మరణాల సంఖ్య పెరగకుండా అన్ని దేశాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మైఖేల్ ర్యాన్ కోరారు. మరోవైపు శుక్రవారం నాటికీ ప్రపంచంలో మొత్తం కరోనా మరణాలు 9,85,707 కు పెరగగా, పాజిటివ్ కేసులు 32.6 మిలియన్లకు పైగా నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu