ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలి?’ అనే అంశంపై మాట్లాడారు. సాధారణంగా చాలా మంది చదువు పూర్తి చేసుకున్నాక ఏమి చేస్తే బాగుంటాను అనే విషయం గురించి ఎక్కువుగా ఆలోచించి సంవత్సరాలు గడిపేస్తుంటారని చెప్పారు. ఎంచుకున్న లక్ష్యం వాస్తవికంగా ఉందో లేదోనని చూసుకోవాలన్నారు. ప్రారంభ సమస్యని అధిగమించి సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించుకునేందుకు పాటించాల్సిన ఆచరణాత్మకమైన విధానాలను ఈ వీడియోలో విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]