ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై జరుగుతున్న తోలి టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ సాధించి పట్టుబిగించింది. ఓవర్ నైట్ స్కోర్ 202/0 తో ఆట కొనసాగించి మరో 300 పరుగులు జత చేసిన భారత జట్టు తోలి ఇన్నింగ్స్ ను 502/7 వద్ద డిక్లేర్డ్ చేసింది. రోహిత్ శర్మ 176 పరుగుల చేసి అవుట్ అవ్వగా, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తన తోలి టెస్టు సెంచరీనే డబుల్ సెంచరీగా మార్చుకుని 215 పరుగులు చేసాడు. చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ తో అదరగొట్టిన మయాంక్ అగర్వాల్ ద్విశతకం సాధించి జట్టును మంచి స్థితిలో నిలిపాడు. ఈ టెస్టులో దక్షిణాఫ్రికా జట్టుపై ఏ వికెట్కైనా 300 భాగస్వామ్యం నెలకొల్పిన భారత జోడీగా రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ కొత్త రికార్డు సృష్టించారు. అయితే మిడిల్ ఆర్డర్ ఆశించినంతగా రాణించలేదు, చటేశ్వర్ పుజారా (6), విరాట్ కోహ్లీ (20), అజింక్య రహానె (15) లు తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. వృద్ధిమాన్ సాహా 21 మరియు హనుమ విహారి 10 సహకారంతో రవీంద్ర జడేజా 30 పరుగులు సాధించగా 7 వికెట్లు కోల్పోయాక కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు స్కోర్ 502/7 వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్డ్ చేసాడు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు రెండవ రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 14 పరుగుల వద్ద ఆ జట్టు ఓపెనర్ అయిడెన్ మార్క్రమ్ (5)ను అశ్విన్ క్లీన్బౌల్డ్ చేశాడు. తరువాత కొద్దిసేపటికే డి బ్రూన్ (4) సైతం అశ్విన్ బౌలింగ్లో సాహా కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తరువాత డేన్ పీడ్ ను (0) రవీంద్ర జడేజా బౌల్డ్ చేసి దక్షిణాఫ్రికా జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. ఆట ముగిసే సమయానికి డీన్ ఎల్గర్ (27), బవుమా (2) బ్యాటింగ్ చేస్తూ క్రీజ్లో ఉన్నారు.