డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో పాటుగా హిందూ ధర్మంపై సందేహాలకు వివరణ ఇస్తున్నారు. అలాగే వివిధ దేవాలయాలు/ ప్రార్ధన మందిరాల్లో అనంత లక్ష్మి గారు ఇచ్చిన ఉపన్యాసాలు మరియు ప్రవచనాలను ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “పారాణి” విశిష్టత గురించి వివరించారు. పసుపుతో పాటుగా పాదాల అలంకరణకు పారాణి వాడతారని చెప్పారు. పసుపు, సున్నం నీరు కలిపితే చక్కని ఎర్రని పారాణి తయారవుతుందని తెలిపారు. పారాణికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని వీక్షించండి.
- Advertisement -