ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా మార్గనిర్దేశం చేయాలి?” అనే అంశం గురించి మాట్లాడారు. విద్యార్థుల చదువు కోసం లేదా కొత్త ప్రదేశాలుకు లేదా జాబ్స్ కోసం వెళ్ళినపుడు ఎదుర్కునే పరిస్థితులపై తల్లితండ్రులు ఎలాంటి సూచనలు ఇవ్వాలో వివరించారు. విద్యార్థులు కొత్త స్థానానికి వెళ్ళినపుడు మార్పుకు సిద్ధంగా ఉండాలన్నారు. మార్పు అనేది ఒక ఛాలెంజ్ మాత్రమే అని అన్నారు. పిల్లలు, విద్యార్థులు ఆన్ లైన్ గేమ్స్ కు అడిక్ట్ కాకుండా చూసుకోవాలని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇