తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. ఎపిసోడ్స్ వారీగా వివరించే ఈ పాఠాలు సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. పరుచూరి గోపాల కృష్ణ గారు వివరించిన ఆరో పాఠం పార్ట్-A లో ఒక కథావస్తువుని భరించేది పాత్ర అని పేర్కొంటూ, సినిమాల్లో ప్రధాన పాత్రల యొక్క ప్రాముఖ్యత మరియు పాత్రల రకాలు గురించి వివరించారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిదా చిత్రాన్ని చూడాలనే ఆసక్తి కలగడానికి గల కారణాలను వివరించారు. అదే విధంగా ఆరో పాఠం పార్ట్-B లో జైలవకుశ సినిమాలో కథాబీజం, కథాంశం మరియు జై పాత్ర యొక్క ప్రాముఖ్యతను విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]