అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సురేశ్‌ రైనా

Indian Cricket Team, ICC trophies, Indian cricket team captain, International Cricket Suresh Raina, Ms Dhoni, Suresh Raina retirement, Suresh Raina Retirement News, MS Dhoni Retires, Suresh Raina Retires From International Cricket

టీమిండియా బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ప్రకటించాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌ ప్రకటించిన కొద్దిసేపటికే రైనా కూడా తన రిటైర్మెంట్ నిర్ణయాన్నివెల్లడించాడు. ”ధోనీ నీతో కలిసి క్రికెట్ ఆడడం ఓ గొప్ప అనుభూతి, ఈ ప్రయాణంలో నేనూ నీతో చేరాలని నిర్ణయించున్నా. జైహింద్‌” అని పేర్కొంటూ ధోనీతో కలిసి ఉన్న ఫోటోను జతచేసి రైనా తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్టు చేశాడు. టీమిండియాలో ఎంతో మంచి మిత్రులుగా పేరున్న ధోనీ, రైనాలు ఒకేరోజు క్రికెట్ కు వీడ్కోలు పలకడం అభిమానులను షాక్ కు గురి చేసింది.

33 సంవత్సరాల రైనా భారత్ తరపున మొత్తం 226 వన్డేలు, 19 టెస్ట్‌లు, 78 టీ-20 మ్యాచ్‌ లు ఆడాడు. 266 వన్డేల్లో 5,615, 18 టెస్టుల్లో 768, 78 టి-20 ల్లో 1605 పరుగులు చేశాడు. వన్డేల్లో 5, టెస్టుల్లో 1, టీ-20ల్లో ఒక సెంచరీ సాధించి ఆడిన అన్ని ఇంటర్నేషనల్స్ ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన అతికొద్ది మందిలో ఒకడిగా సురేశ్ రైనా నిలిచారు. కాగా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరపున సురేశ్ రైనా కొనసాగనున్నాడు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + twenty =