భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ టీ-20 క్రికెట్ కు వీడ్కోలు పలికింది. ప్రపంచ మహిళా క్రికెట్ లో తన సత్తా చాటి ఎన్నో రికార్డులు సాధించిన మిథాలీ రాజ్ తాజాగా టీ-20 ఫార్మాట్ కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. 2021 లో జరగబోయే ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్ పై దృష్టి సారించడంకోసమే టీ-20 క్రికెట్ కు దూరమవుతున్నానని ఆమె తెలిపింది. భారత్ తరుపున 89 టీ-20 మ్యాచులు ఆడిన మిథాలీ రాజ్ 37.52 సగటుతో 2364 పరుగులు చేసింది. 2006లో భారత టీ-20 జట్టుకు తోలి కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించి, 32 మ్యాచులకు కెప్టెన్ గా వ్యవరించారు.
2012, 2014, 2016 టీ-20 ప్రపంచకప్ లలో ఆడిన మిథాలీ రాజ్ భారత్ తరుపున అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా రికార్డ్ సాధించింది. టీ-20 లలో ఆమె అత్యుత్తమ స్కోర్ 97 కాగా, ఈ ఏడాది మార్చ్ లో ఇంగ్లాండ్ తో చివరి టీ20 మ్యాచ్ ఆడింది. దేశానికి వన్డే ప్రపంచకప్ అందించాలన్నది తన లక్ష్యం, కల అని, ఆ టోర్నీకి సిద్ధమయ్యేందుకే టీ20 ఫార్మాట్ కు దూరమవుతున్నానని మిథాలీ రాజ్ చెప్పింది. తనను ఎప్పుడూ ప్రోత్సహించిన బీసీసీఐ ధన్యవాదాలు చెప్పింది. త్వరలో దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ లో తలబడే భారతజట్టుకు మిథాలీ రాజ్ అభినందనలు తెలిపారు.