ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్ మార్చి 29 నుంచి మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం ఫిబ్రవరి 14, శుక్రవారం నాడు ప్రాంచైజ్ యొక్క కొత్త లోగోని విడుదల చేసింది. ఐపీఎల్ 13వ సీజన్ లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొత్త లోగోతో బరిలోకి దిగనుంది. ”కొన్ని రోజులుగా మీరు ఎదురుచూస్తున్న క్షణం ఇదే. కొత్త దశాబ్దం, కొత్త ఆర్సీబీ, కొత్త లోగో ” అంటూ ఆర్సీబీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ఒక వీడియోను పోస్ట్ చేసింది.
కొత్త లోగో ఆవిష్కరించడంపై ఆర్సీబీ ఛైర్మన్ సంజీవ్ చురివాలా మాట్లాడుతూ, నిరంతరం ఆర్సీబీకి అండగా నిలుస్తూ ప్రోత్సహిస్తున్న అభిమానులకు వినోదాన్ని పంచేందుకు నిబద్ధతతో కట్టుబడి ఉన్నామని తెలియజేసేలా లోగోలోని అంశాలను మార్చామని పేర్కొన్నారు. కొత్త లోగోపై ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్లో స్పందిస్తూ కొత్త లోగోను చూడటం థ్రిల్లింగ్గా ఉందన్నాడు. మైదానంలో తమ ఆర్సీబీ ఆటగాళ్ల గర్వాన్ని, సవాళ్లను దీటుగా ఎదుర్కొనే స్ఫూర్తిని ఈ లోగో కలిగి ఉందని చెప్పాడు. మరోవైపు ఆర్సీబీ యాజమాన్యం ముత్తూట్ ఫిన్కార్ప్తో మూడేళ్ల పాటు టైటిల్ స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇక 2016 లో ఆర్సీబీ జట్టు రన్నరప్గా నిలవగా, ఆ తర్వాత ఇప్పటివరకు ప్లేఆఫ్స్కు కూడా చేరుకోలేకపోయింది.