తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 9, గురువారం నాడు కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 471కు చేరింది. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 12 మృతి చెందగా, 45 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 414 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి క్రమంగా పెరుగుతూ పోతుంది. ఏప్రిల్ 10, శుక్రవారం నాడు ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఏప్రిల్ 9, గురువారం రాత్రి 9 గంటల నుంచి ఏప్రిల్ 10, శుక్రవారం ఉదయం 9 గంటల వరకు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో అనంతపూర్ జిల్లాలో 2 కేసులు నమోదయినట్టుగా పేర్కొన్నారు. కొత్తగా నమోదైన 2 కేసులతో కలిపి రాష్ట్రం లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365 కి పెరిగింది. ఇక రాష్ట్రంలో ఈ వైరస్ వలన ఇప్పటికి ఆరుగురు మృతి చెందగా, మరో 10 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్టు ప్రకటించారు.
Media bulletin with district wise break up on status of positive cases of #COVID19 in Telangana (Dated: 09.04.2020) pic.twitter.com/WcBRVwEWHj
— Minister for Health Telangana State (@TelanganaHealth) April 9, 2020
#CovidUpdates: రాష్ట్రంలో నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో అనంతపూర్ జిల్లా లో 2 కేసు లు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 365 కి పెరిగింది.#ApFightsCorona #COVID19Pandemic pic.twitter.com/BHpM487Vqv
— ArogyaAndhra (@ArogyaAndhra) April 10, 2020