ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వ హించాల్సిన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏప్రిల్ 9, గురువారం నాడు ప్రకటించింది. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు జరుగుతున్న నేపథ్యంలోనే పరీక్షలను వాయిదా వేసినట్టు వెల్లడించారు. ఈ పరీక్షలకు సంబంధించి రాష్ట్రంలో చేసిన ఏర్పాట్లన్నీ లాక్డౌన్ వలన నిలిచిపోవడంతో ముందుగా నిర్ణయించిన తేదీల్లో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని పేర్కొన్నారు. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులను బట్టి మే నెలలో కొత్త షెడ్యూల్స్ విడుదల చేసే అవకాశం ఉందని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. మరోవైపు ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తుకు తుది గడువు ఏప్రిల్ 5 గా నిర్ణయించగా, లాక్డౌన్ నేపథ్యంలో దరఖాస్తు గడువును ఏప్రిల్ 17 వరకు పొడిగించినట్టు తెలిపారు.
Home ఆంధ్ర ప్రదేశ్
- Advertisement -