తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 12, ఆదివారం నాడు కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 531కు చేరుకుంది. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 16 మృతి చెందగా, 103 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 412 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 13, సోమవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 432 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఏప్రిల్ 12, ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో గుంటూరులో 8, చిత్తూరులో 2, కృష్ణ మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్కొక కేసుతో కలిపి మొత్తం 12 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 432 కు పెరిగింది. ఇక ఈ వైరస్ వలన ఇప్పటికి ఏడుగురు మృతి చెందగా, మరో 12 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్టు ప్రకటించారు.
Media bulletin on status of positive cases of #COVID19 in Telangana (Dated: 12.04.2020) pic.twitter.com/VkrJLVAl5y
— Minister for Health Telangana State (@TelanganaHealth) April 12, 2020
రాష్ట్రంలో నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరు లో 8, చిత్తూరు లో 2, కృష్ణ మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక కేసు నమోదయ్యాయి
కొత్తగా నమోదైన 12 కేసుల తో రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 432 కి పెరిగింది. #ApFightsCorona pic.twitter.com/JV2nOXARH8— ArogyaAndhra (@ArogyaAndhra) April 13, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu