ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అందరికీ ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు, మూడో విడత ఇంటి సర్వే ఫలితాలు, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పలు ఇతర అంశాలపై సీఎం వైఎస్ జగన్ ఆదివారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు.
రాష్ట్రంలోని సుమారు 5.3 కోట్ల మంది ఉండగా ప్రతి వ్యక్తికి మూడు మాస్కులు చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. మాస్కులు ధరించడం వల్ల కరోనా వైరస్ నుంచి కొంత రక్షణ లభిస్తుందని, వీలైనంత త్వరగా వీటిని పంపిణీ చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో గల 1.47 కోట్ల కుటుంబాల్లో ఇప్పటికి 1.43 కోట్ల కుటుంబాలలో మూడో విడత సర్వే పూర్తయిందని సమీక్ష సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు.
సర్వే ప్రకారం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు శనివారం రాత్రి వరకు 32,349 మందిని పరీక్షల కోసం రిఫర్ చేయగా, వీరిలో 9,107 మందికి పరీక్షలు అవసరమని వైద్యులు నిర్ధారించారు. అయితే మొత్తం 32,349 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తీరును పరిశీలిస్తూ జోన్లను, క్లస్టర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సీఎం ఆదేశించారు. రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్, మార్కింగ్స్ ఉండాల్సిందేనని, ప్రజలు గుమిగూడకుండా సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu