‘స్వతంత్ర భారత వజ్రోత్సవ’ వేడుకల్లో భాగంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవాన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి సహా ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని, అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళర్పించారు. ఆతర్వాత గోల్కొండ కోటకు చేరుకొని సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY