తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 602 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 602 కేసులతో కలిపి నవంబర్ 22, ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,64,128 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ వైరస్ వలన మరణించిన వారి సంఖ్య 1433 కి పెరిగింది.
మరోవైపు కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 2,51,468 మంది సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ కాగా, గత 24 గంటల్లోనే 1015 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 11,227 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే 51 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆదివారం నాడు 24,139 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 51,58,474 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 1,38,594 పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ