తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని నియమిస్తున్నట్టు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పీసీసీ ప్రెసిడెంట్ తో పాటుగా, వర్కింగ్ ప్రెసిడెంట్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ మరియు ప్రచార కమిటీ ఛైర్మన్/కన్వీనర్స్, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ మరియు టీపీసీసీ యొక్క ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ నియామకాలకు సంబంధించి ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అలాగే ఇప్పటివరకు ఈ పదవుల్లో సేవలు అందించిన వారిని కాంగ్రెస్ పార్టీ కొనియాడింది.
తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్:
- ఏ. రేవంత్ రెడ్డి
వర్కింగ్ ప్రెసిడెంట్స్ :
- మహమ్మద్ అజారుద్దీన్
- గీతా రెడ్డి
- జగ్గారెడ్డి
- మహేష్ కుమార్ గౌడ్
- అంజన్ కుమార్
సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ :
- సంభాని చంద్రశేఖర్
- దామోదర్ రెడ్డి
- మల్లు రవి
- పొడెం వీరయ్య
- సురేష్ షెట్కార్
- వేం నరేందర్ రెడ్డి
- రమేష్ ముదిరాజ్
- గోపిశెట్టి నిరంజన్
- టి.కుమార్ రావు
- జావీద్ అమిర్
ప్రచార కమిటీ ఛైర్మన్/కన్వీనర్స్:
- మధుయాష్కీ గౌడ్ – చైర్మన్
- సయ్యద్ హజ్మతుల్లా హుస్సేనీ – కన్వీనర్
ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ:
- దామోదర్ సీ రాజనర్సింహ – చైర్మన్
ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ:
- అల్లేటి మహేశ్వర్ రెడ్డి – చైర్మన్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ