తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూలై 26న, తెలంగాణ భవన్లో పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జిలతో సమావేశం అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం యొక్క నివేదికలను జిల్లాల ఇన్ఛార్జిలతో కలిసి చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశానికి 67 మంది పార్టీ ఇన్ఛార్జిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదుతో పాటు, త్వరలో రాష్ట్రంలో జరగనున్న మునిసిపల్ ఎన్నికలపై కూడ చర్చలు జరిపారు.
టిఆర్ఎస్ పార్టీ జూన్ 27న, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టి, 60 లక్షలు టార్గెట్ గా పెట్టుకుంది, అంతే కాకుండా ప్రతి నియోజకవర్గం నుండి 50,000 మంది సభ్యులను లక్ష్యంగా చేసుకుని జూలై 20 కల్లా సభ్యత్వ నమోదును పూర్తి చేయాలనీ కేటీఆర్ నాయకులను ఆదేశించారు. ఈ రోజు ఇన్ఛార్జిలు సమర్పించిన నివేదికలపై సమీక్ష జరిపారు.
[subscribe]
[youtube_video videoid=MwPO4OngZPo]