హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నేడు ‘అలయ్-బలయ్’ కార్యక్రమం జరుగనుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గొప్పగా చాటిచెప్పేలా ప్రతి ఏటా దసరా పండుగ తర్వాతి రోజున ఆయన ‘అలయ్-బలయ్’ నిర్వహిస్తుండటం తెలిసిందే. 17 ఏళ్ల క్రితం 2005లో బండారు దత్తాత్రేయ దీనిని తొలిసారిగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో గురువారం ఈ ‘అలయ్-బలయ్’ కార్యక్రమం జరుగనుంది. ఈ వేడుకలలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. అదేవిధంగా తెలంగాణ ప్రాంత ప్రత్యేకతతో కూడిన దాదాపు 40రకాల వంటకాలను అతిథులకు రుచి చూపించనున్నారు.
ఇక ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నట్లు అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల గవర్నర్లు, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, భగవత్ మాన్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి, భూపేంద్ర యాదవ్ తదితరులు హాజరుకానుండగా.. రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్లు హాజరవుతారని వెల్లడించారు. అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండారాం తదిదరులు కూడా పాల్గొననున్నట్లు ఆమె తెలిపారు. పార్టీలు వేరైనా ఒకరిపట్ల ఒకరు శత్రుత్వం లేకుండా స్నేహభావాన్ని పెంపొందించుకునేలా అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఒక్క వేదికపై తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశమని గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY