కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అక్టోబర్ 30న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికకు అక్టోబర్ 1న నోటిఫికేషన్ జారీ కాగా, నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమ అభ్యర్థిని ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నర్సింగ్ రావు పోటీలో ఉండనున్నాడని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదం తెలిపినట్టు ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ లో ఉపఎన్నిక జరుగుతుంది. ఈటల రాజేందర్ బీజేపీ నుంచి బరిలో ఉండగా, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ