బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో జనాభా నియంత్రణ చట్టం తీసుకొస్తాం : బండి సంజయ్

Bandi Sanjay Says BJP will Bring Population Control Act in Telangana, Bandi Sanjay Kumar, Bandi Sanjay Kumar public meeting, BJP To Bring Population Control Act, BJP to bring population control bill in Telangana, BJP will bring population control act in Telangana, BJP will bring population control law, Growth And Development In Telangana, Mango News, Praja Sangram Yatra, Telangana Bharatiya Janata Party, Telangana BJP President

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సంగారెడ్డి సభలో మాట్లాడుతూ, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ లో మాదిరిగా తెలంగాణలోనూ జనాభా నియంత్రణ చట్టం తీసుకొస్తాం అని అన్నారు. “ఒక్కరు చాలు..ఇద్దరు హద్దు..ముగ్గురు అసలే వద్దు” ఇదే తమ నినాదమని ప్రకటించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించడానికి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నా, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తూ సీఎం కేసీఆర్ చట్టం తీసుకురావాలని చూశారని, బీజేపీ అడ్డుకోవడంతో భయపడి వెనక్కు తగ్గారని అన్నారు. దమ్ముంటే బిల్లు పెట్టి చూడండి, ఎక్కడ అడ్డుకోవాలో, అక్కడ అడ్డుకుని తీరుతామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + two =