వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం ఉదయం విద్యానగర్ లోని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నివాసానికి వెళ్లి, ఆయన్ను పరామర్శించారు. మందకృష్ణకు ఇటీవలే ఢిల్లీలో శస్త్రచికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైఎస్ షర్మిల ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. మందకృష్ణ త్వరగా కోలుకోవాలని వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. అనంతరం సెప్టెంబర్ 12వ తేదీన ఆదివారం నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్వహించబోయే “దళిత భేరి” బహిరంగ సభకు ఆయన్ను ఆహ్వానించారు. దళితుల పక్షాన తమ యొక్క పోరాటానికి మద్దతుగా నిలవాలని మందకృష్ణ మాదిగను వైఎస్ షర్మిల కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ