దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్” కరోనా వ్యాక్సిన్ ను ఇప్పటికే పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేసిన కేటాయింపులకు అనుగుణంగా భారత్ బయోటెక్ సంస్థ నేరుగా రాష్ట్రాలకే కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను సరఫరా చేస్తుంది. మే 1వ తేదీ నుండి 18 రాష్ట్రాలకు నేరుగా వ్యాక్సిన్ సరఫరా చేయబడుతుందని పేర్కొన్నారు. ఎలాంటి ప్రయత్నలోపం లేకుండా స్థిరమైన వ్యాక్సిన్ సరఫరాను కొనసాగిస్తామని, అర్హులైన ప్రతి వారు వ్యాక్సిన్ వేయించుకోవాలని భారత్ బయోటెక్ సంస్థ పేర్కొంది.
భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ ను నేరుగా సరఫరా చేసే 18 రాష్ట్రాలివే:
- ఆంధ్రప్రదేశ్
- అస్సాం
- బీహార్
- ఛత్తీస్ గడ్
- ఢిల్లీ
- గుజరాత్
- హర్యానా
- జమ్మూ కాశ్మీర్
- జార్ఖండ్
- కర్ణాటక
- మధ్యప్రదేశ్
- మహారాష్ట్ర
- ఒడిశా
- తమిళనాడు
- త్రిపుర
- తెలంగాణ
- ఉత్తర్ ప్రదేశ్
- వెస్ట్ బెంగాల్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ