మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. బుధవారం కూడా కొత్తగా 46,781 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 52,26,710 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 816 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 78,007 కు పెరిగింది. అదేవిధంగా కొత్తగా 58,805 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 46,00,196 కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 5,46,129 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (మే 12, బుధవారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 3,01,00,958
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 52,26,710
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 46,00,196
- కరోనా రికవరీ రేటు – 88.01%
- యాక్టీవ్ కేసులు – 5,46,129
- మే 12న నమోదైన కేసులు – 46,781
- మే 12న డిశ్చార్జ్ అయినవారు – 58,805
- మే 12న నమోదైన మరణాలు – 816
- మొత్తం మరణాల సంఖ్య – 78,007
- కరోనా మరణాలు రేటు – 1.49%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ