కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో కీలక పార్టీలు అయిన టిఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు త్వరలోనే బిజెపిలో చేరుతున్నట్టు చెప్పారు. శనివారం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో తెరాసకి, బిజెపియే ప్రత్యమ్నాయమని,నిజామాబాద్,కరీంనగర్ లాంటి లోక్ సభ నియోజక వర్గాల్లో కల్వకుంట్ల కవితను, వినోద్ కుమార్ ని ఓడించి టిఆర్ఎస్ కంచుకోటలను బిజెపి బద్దలు కొట్టిందని చెప్పారు.
తెలంగాణ లో లోక్ సభ ఎన్నికలలో నాలుగు స్థానాల్లో గెలుపొందడంతో, పార్టీ ఓటు శాతం పెరిగిందని, త్వరలో నిజామాబాద్ కు చెందిన సీనియర్ నాయకుడు డిఎస్ తో సహా చాలామంది నాయకులు బిజెపి లో చేరనున్నట్టు ప్రకటించారు. దత్తాత్రేయ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టించాయి. కర్ణాటక, గోవాలో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా దత్తాత్రేయ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్ సభ ఎన్నికల అనంతరం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవలే నలుగురు టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపి లో చేరిన సంగతి తెలిసిందే.
[subscribe]
[youtube_video videoid=sg6QTNF31Uo]