హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 23,855 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకుంది. కాగా ఉపఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారిగా నేడు (నవంబర్ 6) హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఈటల రాజేందర్ రాబోతున్నారు. నేటి సాయంత్రం 4 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తున్న ఈటల రాజేందర్ కు స్వాగత సభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ నాయకులు, శ్రేణులు సిద్ధమయ్యాయి. స్వాగత సభ కోసం బీజేపీ కార్యాలయం వద్ద ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా ఈ కార్యక్రమంలో భాగంగా ఈటల రాజేందర్ శామీర్ పేట నుంచి తెలంగాణ ఆత్మగౌరవ విజయోత్సవ ర్యాలీ చేపట్టనున్నారు. తుమ్మికుంట, అల్వాల్, ప్యారడైజ్, రాణిగంజ్, గన్ పార్క్ మీదుగా ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ