డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాల జప్తుపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం తాగి నడిపిన వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసు అధికారులకు లేదని హైకోర్టు తెలిపింది. మద్యం తాగిన వ్యక్తులకు మాత్రం వాహనం నడిపేందుకు అనుమతి ఇవ్వవద్దని కోర్టు పేర్కొంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ సందర్భంగా ఆ వాహనంలో మద్యం తాగని మరో వ్యక్తి వెంట ఉంటే అతనికి వాహనం అప్పగించాలని సూచించింది.
అలాగే మద్యం తాగి పట్టుబడ్డ వ్యక్తి వెంట ఎవరూ లేకపోతే, సన్నిహితులను పిలిపించి వాహనాన్ని అప్పగించాలని, ఒకవేళ ఎవరూ రాకపోతే వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించి తర్వాత వారికీ అందించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలు చేయని పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని చెప్పారు. మరోవైపు ప్రాసిక్యూషన్ అవసరమైన కేసుల్లో 3 రోజుల్లో ఛార్జిషీట్ వేసి, ప్రాసిక్యూషన్ పూర్తయిన వెంటనే వాహనాన్ని అప్పగించాలని తెలిపింది. ఇక వాహనాన్ని తీసుకునేందుకు ఎవరూ రాకపోతే చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కోర్టు సూచించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ