తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ విధించబడిన బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ లను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, వారు అసెంబ్లీ సస్పెన్షన్ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తమను సస్పెండ్ చేసినట్టు బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు. రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యేలుగా తమ హక్కులను పరిరక్షించాలని హైకోర్టును కోరారు.
ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనటం రాజ్యాంగం తమకిచ్చిన హక్కని, కాబట్టి సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. సభలో తాము నిబంధనలను పాటించామని.. అయినా తమను సస్పెండ్ చేశారని పిటిషన్లో తెలిపారు. సస్పెన్షన్ తీర్మానం, దానికి సంబంధించిన రికార్డులు సమర్పించేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును కోరారు. కాగా, ఈ పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ