కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా ప్రముఖ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులు, అన్ని వర్గాల నుంచి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం చర్యలకు మద్దతుగా బ్రాడ్రిడ్జ్ ఐటీ కంపెనీ సీఎం సహాయనిధికి రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించింది. అందుకు సంబంధించిన చెక్కును బ్రాడ్రిడ్జ్ కంపెనీ ప్రతినిధులు ఈ రోజు ప్రగతిభవన్ లో రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటిఆర్ ను కలుసుకుని అందజేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu