త్వరలో తాను పార్టీ మారనున్నానని వస్తున్న ఊహాగానాలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు జిల్లాలోని మణుగూరులో మంగళవారం తన అభిమానులు, అనుచరులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారం ఉన్నా, లేకున్నా నిత్యం ప్రజల్లోనే ఉన్నానని, ప్రజల ఆశీర్వాదం ఉంటే పదవులు వాటంతట అవే వస్తాయని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తానని, తనను నమ్ముకున్న వారి కోసమే తన జీవితం అని పొంగులేటి స్పష్టం చేశారు. ఇటీవల తనకు భద్రతా సిబ్బందిని తగ్గించారని, ఇప్పుడున్న ఇద్దరిని తీసేసినా తానేమీ బాధ పడనని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలను కలుస్తానని, తనను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ప్రజలను వదిలేది లేదని శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE