బీఆర్ఎస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరవనున్నారు. ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసిన అధికారులు డిసెంబర్ 19వ తేదీన తమ ముందు విచారణ కోసం రావాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తనకు మరికొంత సమయం కావాలని, అధికారులు కోరిన సమాచారం అందించడానికి ఒక వారం రోజుల గడువు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన తన పీఏ ద్వారా ఈడీ కార్యాలయానికి లేఖ పంపించారు. కానీ అనుదుకు అనుమతించని అధికారులు రోహిత్ రెడ్డి తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యే తన లాయర్తో కలిసి హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి వెళ్ళానున్నారు. అయితే ఏ కేసులో తనకు నోటీసులు ఇచ్చారో తెలియదని రోహిత్ రెడ్డి చెబుతున్నప్పటికీ, కర్ణాటకలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసుకి సంబంధించి ఆయనకు నోటీసులు అందినట్లు తెలుస్తోంది.
ఇక ఇటీవలే మణికొండలోని రోహిత్ రెడ్డి నివాసానికి పీఎంఎల్ఏ కింద ఈడీ నోటీసులు పంపింది. రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యులు, వ్యాపారాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈడి అధికారులు అడిగారు. కుటుంబ సభ్యుల ఆధార్, పాస్పోర్ట్, పాన్కార్డ్, సేల్ డీడ్ తదితర వివరాలు అందించాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. అలాగే ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో కూడిన ఇన్వాయిస్ కాపీలను తీసుకురావాలని కూడా ఈడీ సూచించింది. ఇంకా, వారు కొనుగోలు చేసిన ఆస్తులకు సంబంధించి నిధులు ఎక్కడినుంచి వచ్చాయన్న వివరాలను తెలియజేయాలని కోరింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఈడీ ఎలాంటి ప్రశ్నలు సంధిస్తుంది? డ్రగ్ కేసు గురించి ప్రశ్నలు ఉంటాయా? లేదంటే కేవలం వ్యాపార లావాదేవీల గురించి మాత్రమే ఆరా తీస్తారా? అని అందరిలో సందేహాలు నెలకొన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE