తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతో పాటుగా, రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లానున్నట్టు తెలుస్తుంది. అలాగే నీతి ఆయోగ్ ఏడవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనే అంశం, రాష్ట్ర బీజేపీ నాయకుల విమర్శలు, బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్, పార్టీల మార్పుతో వేడెక్కిన రాజకీయ వాతావరణం, ఉప ఎన్నికల హడావిడి మరియు దేశంలో పలువురు నాయకులపై ఈడీ విచారణలు అంశంపై సీఎం స్పందించే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా ఏ అంశంపై మీడియా సమావేశం అనేది అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతారానే విషయంపై రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో ఆసక్తి నెలకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY