తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానానికి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆదివారం నాడు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
ఇక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలోనే అభ్యర్థిని నిర్ణయిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మరోవైపు ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం బరిలోకి దిగనున్నట్టు ఇప్పటికే ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ