కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై మే 15, శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా ఆక్టివ్ కేసులు లేవని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్డౌన్ నిబంధనలు యధావిధిగా అమలు చేయాలని, మే 17తో ముగుస్తున్న దేశ వ్యాప్త లాక్డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను పరిశీలించి, రాష్ట్రంలో అనుసరించే వ్యూహం ఖరారు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు కొనసాగిస్తూనే, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మే 16, శనివారం నుంచి రాష్ట్రంలో రెడ్ జోన్ ప్రాంతాలు, జీహెఛ్ఎంసీ ఏరియాలో కొత్తగా ఇచ్చే మినహాయింపులను సీఎం కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణలో కొత్తగా ఇచ్చిన మినహాయింపులు:
- ఏసీ షాపులకు అనుమతి.
- ఆటోమోబైల్ షో రూములు తెరవడానికి అనుమతి.
- ఆటో మోబైల్ స్పేర్ పార్ట్స్ షాపులకు అనుమతి.
- ఫాన్స్ షాపులకు అనుమతి.
- రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఆర్టీఏ కార్యాలయాల్లో కార్యకలాపాలు కొనసాగుతాయి.
- మిగతా లాక్డౌన్ నిబంధనలు యధాతంగా అమలు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu