తెలంగాణలో ప్రజాసమస్యలు గురించి తెలుసుకునేందుకు ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో పాదయాత్ర చేపట్టిన వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కొద్ది రోజుల విరామం తర్వాత ఈరోజు తన పాదయాత్రను పునఃప్రారంభించారు. ఈ క్రమంలో ఇప్పటికే 1500 కిలోమీటర్లు నడిచిన షర్మిల.. 117వ రోజు పాదయాత్రను మంగళవారం కొడంగల్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఐదు రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. అయితే కొడంగల్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ షర్మిల పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY