తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సిద్ధమని, అవసరమైతే అసెంబ్లీ రద్దు చేస్తానని సంచలన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మేరకు ఆదివారం ప్రగతిభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ సర్కార్ పై సీఎం కేసీఆర్ పలు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగం లోని కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
- భారత దేశచరిత్రలో అత్యంత అసమర్థమైన ప్రధాని మోదీ, ఆయనకు వ్యతిరేకంగా శ్రీలంకలో కూడా ఆందోళనలు చేస్తున్నారు.
- దేశంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగింది.
- గ్యాస్ ధరలు, ఇంధన ధరలు, నిత్యావసరాల ధరలు.. ఇలా ప్రతిదీ పెరిగిపోయింది.
- విదేశాల నుంచి బొగ్గు కొనుగోళ్లలో లక్షల కోట్ల కుంభకోణం జరిగింది, ఈడీలు, సీబీఐలు బ్యాంకు దొంగల్ని ఎందుకు పట్టుకోవట్లేదు?
- తెలంగాణలో అమలవుతున్న వాటిలో కనీసం 20 శాతమైనా బీజేపీ రాష్ట్రాల్లో అమలవుతున్నయా?
- తెలంగాణ ఇంజన్ స్పీడ్ ఎక్కువ, బీజేపీ సర్కార్ ఇంజన్ స్లో.. తెలంగాణది 100 హెచ్పీ ఇంజన్ అయితే బీజేపీది 50 హెచ్పీ.
- కేసీఆర్ కేసులకు భయపడడు.. అక్రమంగా ఎన్టీఆర్ ని గద్దె దించితే ఏం జరిగిందో దేశం చూసింది.
- దేశంలో రూ.3 వేలకే టన్ను బొగ్గు దొరుకుతుంటే.. విదేశాల నుంచి రూ.30 వేలకు టన్ను బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు.
- ఇక్కడ నన్ను దించాలని చూస్తే, ఢిల్లీలో బీజేపీని దించడం ఖాయం.
- తెలంగాణ రైతులకు ధరణి, ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నాం.. తెలంగాణ మోడల్ దేశానికి అవసరం.
- ఈ దేశానికి కొత్త ఎజెండా కావాలి.. అందుకు అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుంది.
- ముందస్తుకు నేను సిద్ధం, అవసరమైతే అసెంబ్లీని రద్దు చేస్తా.. బీజేపీ వాళ్లకు నిజంగా దమ్ముంటే ముందస్తు ఎన్నికల తేదీని ప్రకటించమనండి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ