ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయన ‘వైఎస్సార్ వాహనమిత్ర’ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని విడుదల చేయనున్నారు. కాగా ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ఆటో, టాక్సీ మరియు మ్యాక్సీ క్యాబ్ల డ్రైవర్లకు వార్షికంగా రూ. 10,000 నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
సీఎం జగన్ విశాఖపట్నం పర్యటన షెడ్యూల్ ఇదే..
- జూలై 13 ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు.
- ఉదయం 11:00 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానానికి వెళ్లి 11.05 నుంచి 11.15 గంటల వరకు స్టాళ్లను సందర్శిస్తారు.
- ఆ తర్వాత వైఎస్ఆర్ వాహన మిత్ర ఫొటో ఎగ్జిబిషన్ను వీక్షిస్తారు. అనంతరం వైఎస్ఆర్ వాహన మిత్ర లబ్ధిదారులతో ఫోటో సెషన్ ఉంటుంది.
- ఉదయం 11.40 నుంచి 11.45 గంటల వరకు లబ్ధిదారుల ప్రసంగాలు, అనంతరం 11.45 నుంచి 11.47 వరకు వాహన మిత్ర అనే అంశంపై వీడియో ప్రదర్శన ఉంటుంది.
- 11.47 నుంచి 12.17 గంటల వరకు సీఎం జగన్ ప్రసంగించనున్నారు. పా తర్వాత మధ్యాహ్నం 12.20 గంటల నుంచి వైఎస్ఆర్ వాహనమిత్ర లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారు.
- చివరిగా ముఖ్యమంత్రి మధ్యాహ్నం 12.30 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరి 12.55 గంటల నుంచి 1.15 గంటల వరకు స్థానిక నేతలతో సమావేశమై 1.20 గంటలకు గన్నవరం బయలుదేరుతారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ