పంచాయతీరాజ్ వ్యవస్థలో మెరుగైన పనితీరును కనబరిచే స్థానిక సంస్థలకు కేంద్రం ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మక ‘‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీరాజ్ స్వశక్తి కరణ్ పురస్కార్’’కు నిజామామాద్ జిల్లా పరిషత్ ఎంపికైంది. రూ. 50 లక్షల నగదు, మెమెంటోను ఈ అవార్డు కింద ఇస్తారు. అవార్డుకు ఎంపికైన సందర్భంగా శుక్రవారం నాడు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావును అభినందించారు. అదే సమయంలో తన పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ నుంచి విఠల్ రావు ఆశీస్సులు అందుకున్నారు. టిఆర్ఎస్ యువజన నాయకులు సందీప్ రావు, సత్యంరావు కూడా సీఎం ను కలిసిన వారిలో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu