తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జీహెచ్ఎంసీ పరిధిలో మినహా మిగతా జిల్లాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు పాల్గొంటారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని సమస్యలను ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి, తదనుగుణంగా నిర్ణయం తీసుకుని ప్రకటించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu