తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ లాక్డౌన్ సమయంలో ఆర్టీసీ బస్సులను నడపొద్దని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన అంతర్గత ఉత్తర్వులను జారీ చేసినట్టు తెలుస్తుంది. లాక్డౌన్ నిబంధనల్లో ప్రజా రవాణాకు సంబంధించి అంతర్ రాష్ట్ర బస్సులు, జిల్లాలలో, జిల్లాల మధ్య నడిచే ప్రయాణికుల బస్సులను అనుమతించకూడదని ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అన్ని డిపోల యొక్క అధికారులు, యూనిట్ అధికారులు నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెప్పారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ లతో సంబంధం లేకుండా ఎక్కడైనా బస్సులు నడపడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ మూడు జోన్ల పరిధిలోని ఆర్టీసీ కార్యాలయాల అధికారులు మాత్రం తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని చెప్పారు. రెడ్ జోన్ల పరిధిలోని కార్యాలయాల్లో జూనియర్ స్కేల్ ఆఫీసర్ కంటే కింది స్థాయి సిబ్బందిలో 33 శాతం సిబ్బంది విధులకు హాజరు కావాలని చెప్పారు. ఇక గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలోని కార్యాలయాల్లో వంద శాతం సిబ్బంది విధులకు హాజరు కావాలని స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu