మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమైంది. మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం 2,427 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. 40 శైవక్షేత్రాలకు ఫిబ్రవరి 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడపనుందని, భక్తులు, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.
మహా శివరాత్రికి 2,427 ప్రత్యేక బస్సుల వివరాలు:
- శ్రీశైలంకు – 578 ప్రత్యేక బస్సులు
- ఏడుపాయలకు – 497
- వేములవాడకు – 481
- కీసర గుట్టకు – 239
- వేలాలకు -108
- కాళేశ్వరంకు – 71
- కొమురవెల్లికి – 52
- రామప్పకు – 15.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE