హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఈ పట్టభద్రుల స్థానానికి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అభ్యర్థి సురభి వాణీదేవి, ఆయా జిల్లాల పరిధిలోని మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై సీఎం కేసీఆర్ వారికీ దిశానిర్దేశం చేశారు. అలాగే సురభి వాణీదేవికి టీఆర్ఎస్ పార్టీ బి-ఫామ్ ను సీఎం కేసీఆర్ అందజేశారు. సీఎం కేసీఆర్ తో సమావేశానికి ముందు నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద సురభి వాణీదేవి నివాళులర్పించారు. అలాగే సమావేశం అనంతరం గన్ పార్క్ వద్దకు చేరుకొని అమరవీరుల స్తూపం వద్ద ఆమె నివాళులర్పించారు. ఆతర్వాత జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని సురభి వాణీదేవి నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ