ప్రగతి భవన్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జాతీయపతాకాన్ని ఎగురవేసిన సీఎం కేసీఆర్

CM KCR Hoists National Flag on the Occasion of Telangana Formation Day at Pragathi Bhavan, KCR Hoists National Flag on the Occasion of Telangana Formation Day at Pragathi Bhavan, Telangana CM KCR Hoists National Flag on the Occasion of Telangana Formation Day at Pragathi Bhavan, CM KCR Hoists National Flag on the Occasion of Telangana Formation Day, Telangana Formation Day at Pragathi Bhavan, Pragathi Bhavan, Telangana Formation Day, CM KCR Hoists National Flag, Telangana CM KCR Hoists National Flag, Telangana Formation Day Celebrations at Pragathi Bhavan, Telangana Formation Day Celebrations, Telangana Formation Day Celebrations News, Telangana Formation Day Celebrations Latest News, Telangana Formation Day Celebrations Latest Updates, Telangana Formation Day Celebrations Live Updates, Telangana CM KCR, CM KCR, Mango News, Mango News Telugu,

ప్రగతిభవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఎంపీలు సంతోష్‌ కుమార్‌, దీవకొండ దామోదర్‌ రావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, పలువురు నేతలు, సిబ్బంది పాల్గొన్నారు.

అనంతరం సీఎం కేసీఆర్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌ కు చేరుకొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పబ్లిక్ గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దీనికి ముందుగా సీఎం కేసీఆర్ గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపాన్ని సందర్శించి, పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళులర్పించారు. పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నో అంశాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, దేశంలోనే త్వరితగతిన అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్ర విజయాలను, ఘనతను సీఎం కేసీఆర్ వివరించారు.

మ‌రోవైపు తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌లు ఘనంగా జ‌రుగుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు జాతీయ జెండా ఆవిష్క‌రిస్తున్నారు. ఈ సందర్భంగా అమరవీరులకు తెలంగాణ నేత‌లు నివాళులు అర్పిస్తున్నారు. అలాగే అసెంబ్లీలో స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాసరెడ్డి, శాన‌మండ‌లిలో ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. తెలంగాణ రాష్ట్రం ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వసంతలోకి అడుగుపెట్టిన నేప‌థ్యంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 6 =