తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో మే 12 నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో బ్యాంకులు, ఏటీఎం సేవలకు మినహాయింపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) బ్యాంకుల పనివేళలపై కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేశారు. మే 13, గురువారం నుంచి మే 20, గురువారం వరకు రాష్ట్రంలో బ్యాంకింగ్ పని వేళలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే పరిమితం చేశారు. దీంతో బ్యాంకులు రోజు కేవలం 4 గంటలు మాత్రమే పని చేయనున్నాయి. మరోవైపు ఈ సమయంలో కేవలం 50 శాతం మంది సిబ్బంది మాత్రమే బ్యాంకు విధులకు హాజరు కానున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ