తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఏప్రిల్ 27, 2001 న సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్థాపించిన టిఆర్ఎస్ పార్టీ నేటితో 20 ఏండ్లు పూర్తీ చేసుకుంది. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ కు చేరుకొని ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఎగురవేశారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కొద్దీ మంది నాయకులతోనే నిరాడంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, హోమ్ మంత్రి మహమ్మద్ అలీ, ఎంపీ కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ కేసీఆర్.#20YearsOfTRS #TRSFormationDay pic.twitter.com/FbPYzErzTW
— TRS Party (@trspartyonline) April 27, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu