తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా కేశవరావు పేదలకు అందించిన న్యాయ సేవలను సీఎం స్మరించుకున్నారు. కేశవరావు కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జస్టిస్ పి.కేశవరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని, సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
గతకొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జస్టిస్ కేశవరావు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సెప్టెంబర్ 21, 2017 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కేశవరావు సేవలు అందిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు జస్టిస్ కేశవరావు మృతిపై సంతాపంగా రాష్ట్రంలోని అన్ని కోర్టులకు సోమవారం నాడు హైకోర్టు సెలవును ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ