తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ ల బదిలీ జరిగింది. మెదక్, పెద్దపల్లి జిల్లాలకు నూతన కలెక్టర్లను నియమించారు. రంగారెడ్డి జిల్లాలో అదనపు కలెక్టర్ గా ఉన్న ఎస్.హరీశ్ను బదిలీ చేసి మెదక్ జిల్లా కలెక్టర్గా నియమించారు. ప్రస్తుతం మెదక్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న పి.వెంకట్రామిరెడ్డిని ఆ స్థానం నుండి రిలీవ్ చేశారు. అలాగే సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ గా ఉన్న ఎస్.సంగీత సత్యనారాయణను పెద్దపల్లి కలెక్టర్గా నియమించారు. ప్రస్తుతం పెద్దపల్లి కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న భారతీ హోళికేరీని ఆ స్థానం నుండి రిలీవ్ చేశారు. ఈ మేరకు ఫిబ్రవరి 4, గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ