తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంకా అక్కడో, ఇక్కడో మిగిలివున్న భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా జూలై 15వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణపై మంగళవారం ప్రగతి భవన్లో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు. మండలం కేంద్రంగా మూడు రోజులకు ఒక మండలం చొప్పున 100 బృందాలను ఏర్పాటు చేసి, జాయింట్ కలెక్టర్, డిఆర్వో, ఆర్డీవోల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించి అవగాహన సదస్సు జూలై 11వ తేదీన ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుందని తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు హాజరు కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY