టీఆర్ఎస్ నేత, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్ లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క సమక్షంలో తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ పార్టీ కండువా కప్పి తాటి వెంకటేశ్వర్లును కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. తాటి వెంకటేశ్వర్లుతో పాటుగా కరకగూడెం జడ్పీటీసీ కొమురం కాంతారావు, పలువురు అనుచరులు కూడా కాంగ్రెస్ లో చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేత తాటి వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. తనను పార్టీ కార్యక్రమాలకు ఉద్దేశ్య పూర్వకంగానే పక్కన పెడుతున్నారని ఇటీవలే ఆయన విమర్శలు చేశారు. పార్టీ అధిష్టానం స్పందించకపోతే పార్టీ మారతానని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడి, నేడు కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మరోవైపు గురువారం నాడు పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ చేరిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF