మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణ శీలిగా భారత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన రంగాలలో పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితాన్ని నేడు భారత దేశం అనుభవిస్తున్నదని, అంతర్గత భద్రత, విదేశాంగ, వ్యవహారాల్లోనూ పీవీ అవలంభించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి భారత దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పటిష్టపరిచిందిని సీఎం కేసీఆర్ కొనియాడారు. బహు భాషా వేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప పరిపాలకుడిగా అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పీవీకి ఘనమైన నివాళి అర్పించేందుకే శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతతో నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ